News April 9, 2024

HYD: ‘పేదలందరికీ ప్రభుత్వమే అద్దాలివ్వాలి’

image

HYD మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నిత్యం దాదాపుగా 1250 నుంచి 1350 మంది రోగులు వస్తుంటారు. అయితే వారిలో రోజు దాదాపు 200 నుంచి 300 మందికి డాక్టర్లు అద్దాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో పేదలు బయటకు వెళ్లి డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అద్దాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News September 11, 2025

HYD: నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడంపై ముందడుగు..!

image

HYDలో CipherCop-2025 ప్రారంభమైందని బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ తెలిపారు. ఇది మొదటి జాతీయ హ్యాకథాన్ అన్నారు. వచ్చే 2 రోజుల్లో యువ మేధావులు పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో క్రిప్టో లావాదేవీలు గుర్తించడం, నకిలీ వెబ్‌సైట్లు, స్కామ్ యాప్‌లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్‌ను వెలికితీయడంపై సవాళ్లు స్వీకరిస్తారని చెప్పారు.

News September 11, 2025

HYD: ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి

image

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

News September 11, 2025

HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

image

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు అభినందనలు తెలిపారు.