News August 24, 2024
HYD: ప్రజావాణికి 1150 అర్జీలు

బేగంపేట్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
Similar News
News February 18, 2026
మాదకద్రవ్యాలతో రీల్స్ చేశారు.. అడ్డంగా బుక్ అయ్యారు!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత దారి తప్పుతోంది. ఫలక్నుమాకు చెందిన శ్రీచరణ్, విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులు శివరాత్రి పర్వదినం రోజున మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గమనించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్, రీల్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.
News February 18, 2026
ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
News February 18, 2026
రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


