News April 7, 2025
HYD: ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అందిన దరఖాస్తుల్లో గృహ నిర్మాణానికి సంబంధించినవి 18, పెన్షన్ 10, ఇతర శాఖలకు చెందినవి 28 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 7, 2025
రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 56 ఫిర్యాదులు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. 56 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఫిర్యాదులని డీఆర్వో సంగీత స్వీకరించి తాగు చర్యల కోసం సంబంధించిన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ- 21, ఇతర శాఖలకు – 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు డీఆర్ఓ సంగీత సూచనలు ఇచ్చారు.
News April 7, 2025
HYD: ఈషాసింగ్ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో ఈషా సింగ్కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో ఇది దేశానికి మూడో పతకం.
News April 7, 2025
HYD: పుష్పక్ బస్సులకు రూట్ పాస్ ప్లాన్

సిటీలో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిపే పుష్పక్ బస్సులకు నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడం, కేవలం 60 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండడంతో రూట్ పాస్లు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. సిటీ మొత్తం అయితే రూ.5,200, శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ రూ.2,110, బాలాపూర్ టు ఎయిర్ పోర్టు రూ.3,100, ఎల్బీనగర్, గచ్చిబౌలి టు ఎయిర్పోర్టుకు రూ.4,210 ఖరారు చేయనున్నారు.