News April 11, 2025
HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.
Similar News
News December 27, 2025
తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 27, 2025
డేట్ మార్చారు.. రేటు పెంచారు: ఎక్స్పైర్డ్ ఫుడ్తో ఆటలు!

UK, US, దుబాయ్ నుంచి తక్కువ ధరకు Expired ఫుడ్ తెప్పించి ఫ్రెష్ ఐటమ్స్గా అమ్ముతున్న భారీ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు ₹4.3 కోట్ల విలువైన పాపులర్ బ్రాండ్ల ప్రోడక్ట్స్ సీజ్ చేశారు. కొత్త MRP, Barcodes వేసి టాప్ స్టోర్స్తో పాటు ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాస్టర్మైండ్ అటల్ జైస్వాల్తో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 27, 2025
సిరిసిల్ల: కూలీల ఆధార్ అనుసంధానం.. 86% పూర్తి

సిరిసిల్ల జిల్లాలో జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం కూలీల ఆధార్ అనుసంధాన కార్యక్రమం 86%కు పైగా పూర్తైంది. 12 మండలాల్లో లక్షా 95వేల 227 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించగా, వీరిలో ఇప్పటివరకు లక్షా 50వేల 442 మంది కూలీల ఆధార్ లింక్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగితా కూలీల ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఒకరి స్థానంలో మరొకరు పనిచేయకుండా కేవైసీ చేపట్టిన విషయం తెలిసిందే.


