News August 24, 2024
HYD: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి అంతంతే..!

HYD ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే అంతంత మాత్రమే జరుగుతుంది. 2013నుంచి ఇప్పటివరకు సుమారు నిమ్స్ ఆసుపత్రిలో 32, గాంధీలో ఒకటి, ఉస్మానియాలో 9 అవయవ మార్పిడి పరీక్షలు జరిగాయి. అదే.. యశోదలో 486, కిమ్స్లో 275 అవయవ మార్పిడిలు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులు ఉన్నప్పటికీ, అత్యాధునిక థియేటర్లు, పూర్తి వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
Similar News
News February 28, 2026
తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.
News February 28, 2026
HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.
News February 28, 2026
HYD: నమ్మండి.. ఇది రోడ్డే..!

ప్రతాపసింగారం-ఉప్పల్ రహదారి ముత్వెల్లిగూడలో నరకకూపంగా మారింది. R&B, మున్సిపల్, HMWSSB అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమైంది. మోకాలి లోతు గుంతలు ఏర్పడినా యంత్రాంగం కళ్లుమూసుకుంది. 15 రోజులుగా కృష్ణా నీటి పైప్లైన్ లీక్ అవుతున్నా జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇరు అధికారుల బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ఠగా మారి ప్రజలకు శాపమైంది.


