News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News April 5, 2026
సిరిసిల్ల : విద్యుత్ సిబ్బందికి రక్షణ కవచాలు అందజేత

విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో ఎన్పీడీసీఎల్ ముందడుగు వేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి రక్షణ కవచాలు అందించింది. లైన్ లో విద్యుత్ సరఫరా ఉంటే తెలిసిపోయేలా ఎర్త్ రాడ్లతో పాటు హెల్మెట్లు, జాకెట్ లు పంపిణీ చేశారు. కాగా సెస్ ను ఎన్పీడీసీఎల్ ఆధీనంలోకి తీసుకున్న మూడు రోజుల్లోనే రక్షణ కిట్లు పంపిణీ చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
News April 5, 2026
‘PSL నం.1 అవుతుంది’.. PCB ఛైర్మన్ డబ్బా!

కేవలం 2 వేదికల్లో, <<19452212>>ఖాళీ స్టేడియాల్లో<<>> నిర్వహిస్తున్న PSLపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా PSL మారిందని బోర్డు మీటింగ్లో గొప్పలకు పోయారు. ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అవుతుందని అన్నారు. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోందని, గ్లోబల్ స్టేజ్పై పాక్ క్రికెట్కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.
News April 5, 2026
సిరిసిల్ల: ‘అవసరమైన విద్యుత్తును అందజేస్తాం’

పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తామని TGNPDCL సిఎండి వరుణ్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని పవర్ లూమ్ పరిశ్రమలను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా సాధించడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై దృష్టి సారిస్తామన్నారు. నేతన్నల సంక్షేమం పట్ల కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.


