News July 7, 2025
HYD: ‘ఫిష్ వెంకట్ ఆస్పత్రి ఖర్చు ప్రభుత్వానిదే’

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. బోడుప్పల్లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడిని మంత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు.
Similar News
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 15, 2025
‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.
News September 15, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.