News September 13, 2025
HYD: ఫోన్కు APK ఫైల్.. నొక్కితే రూ.95,239 మాయం

హైదరాబాద్లో టైలర్కు RTO CHALLAN పేరిట APK ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ నుంచి రూ.95,239 మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా దొంగిలించి ఆన్లైన్ ఆర్డర్ చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి వచ్చేలా చేశారు. ఇలాంటి APK ఫైల్తో మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News September 13, 2025
GWL: జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,884 కేసులు పరిష్కారం

తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో న్యాయం అందించడమే లక్ష్యమని గద్వాల జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలత పేర్కొన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 6,884 కేసులు పరిష్కరించామని తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 22, క్రిమినల్ కేసులు 6,832, కుటుంబ వివాదాల కేసులు 2, ప్రమాద బీమా కేసులు 6, సైబర్ క్రైమ్ కేసులు 22, ఇరు వర్గాల సమ్మతితో తక్కువ ఖర్చుతో పరిష్కరించామని చెప్పారు.
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
మెదక్: లోక్ ఆదాలత్లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.