News December 19, 2024

HYD: బాపుఘాట్ నుంచే మూసీ కలుషితం..!

image

మూసీ, ఈసా నదుల కలయిక అయిన బాపుఘాట్ నుంచి ఎప్పుడైతే మూసి HYDలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి మూసీ కలుషితం ప్రారంభమవుతుంది. బాపుఘాట్ ప్రాంతంలో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ స్థాయి అమాంతం పడిపోతుంది. ఈ విషయాన్ని స్వయాన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా తెలిపింది. గండిపేటలో-6 ఉండగా బాపుఘాట్ నుంచి ముసారంబాగ్, నాగోల్, నల్లచెరువు పీర్జాదిగూడ, ప్రతాపసింగారం ప్రాంతాల్లోనూ 0.3గా నమోదైంది.

Similar News

News November 14, 2025

BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

image

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: ఎవరు గెలిచినా విజయోత్సవాలకు నో పర్మిషన్!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుండగా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా విజయోత్సవాలకు పర్మిషన్ లేదని అధికారులు స్పష్టం చేశారు.

News November 14, 2025

జూబ్లీ బైపోల్: కౌంటింగ్‌ హాల్లోకి వీరికి మాత్రమే అనుమతి

image

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు అవుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ హాల్‌కు చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు.
SHARE IT