News July 19, 2024
HYD: బాలికపై ఏడాదిగా అత్యాచారం

ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్పేట్లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్కు చెందిన కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నడుపుతోంది. పాన్షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News August 26, 2025
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

ఈనెల 27- SEP 6 వరకు ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోజూ ఉ.11 నుంచి రద్దీని బట్టి ప్రధాన మార్గాలైన VV స్టాచ్యూ, సైఫాబాద్ పాత PS, నెక్లెస్ రోటరీ వైపుల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామన్నారు. భక్తులు మెట్రో, బస్సులు వంటి ప్రజారవాణాను ఉపయోగించాలాన్నారు. ఐమాక్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
News August 26, 2025
HYD: అంతర్జాతీయ పోటీల్లో ‘FIRE’ కానిస్టేబుల్

HYD అగ్నిమాపక కానిస్టేబుల్ అవుల నరసింహ, ఐసీఎన్ ప్రో కార్డ్ గెలుచుకుని అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించారు. ‘Mr. Fit Cop’గా పేరుగాంచిన నరసింహ, తన వృత్తిని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఘనతతో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసింహను పలువురు అభినందించారు.
News August 26, 2025
ఉత్సవాలకు ముందే.. HYDలో తొలి విగ్రహం నిమజ్జనం

వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్సాగర్లో నిమజ్జనం జరిగింది. దోమల్గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్నగర్లో కేబుల్స్కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.