News July 7, 2024

HYD: బాలికపై డీసీఎం డ్రైవర్ అత్యాచారం

image

బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. HYD బహదూర్‌పుర వాసి మహేశ్(25) డీసీఎం డ్రైవర్. ఇతడు కీసర మండలం రాంపల్లిదాయరలోని ఓ పరిశ్రమ నుంచి పైపులు తీసుకెళ్లేందుకు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో సమీపంలో ఉండే బాలిక(14)పై అతడి కన్నుపడింది. రాత్రి వచ్చిన మహేశ్‌కు బాత్ రూమ్ వెళ్లిన బాలిక కనిపించగా తీసుకెళ్లి వ్యానులో అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News February 21, 2026

HYDలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

image

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్య సాయి నిగామగమం ట్రస్ట్‌లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

News February 21, 2026

దిల్‍సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు 13 ఏళ్లు

image

దిల్‍సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు పడిన శిక్షలు త్వరగా అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

News February 21, 2026

HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

image

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.