News February 9, 2025

HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

image

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్‌ చేశారు. 

Similar News

News February 10, 2025

నేడు కొడంగల్‌‌కు KTR.. షెడ్యూల్ ఇదే!

image

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు కొడంగల్‌లో పర్యటిస్తారు.
షెడ్యూల్ వివరాలు:
10:30AM-నార్సింగిలోని నివాసం నుంచి బయలుదేరుతారు
12:30PM-పరిగి మాజీ MLA కొప్పుల మహేశ్ ఇంట్లో లంచ్
01:40PM-కొడంగల్‌ తున్కిమెట్లలో BRS పార్టీ జెండా ఆవిష్కరణ
02:00PM-హకీంపేట్, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా రైతులకు పరామర్శ
03:00PM-కోస్గి చౌరస్తాలో రైతు మహా ధర్నాలో పాల్గొంటారు.

News February 9, 2025

సికింద్రాబాద్: షాపింగ్‌ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

image

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్‌ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News February 9, 2025

ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

image

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

error: Content is protected !!