News July 17, 2024
HYD: బాలుడిని పీక్కు తిన్న కుక్కలు.. మృతి
HYD జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్ ఆదర్శ నగర్ కాలనీ ఫేజ్-2లో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే విహాన్ అనే బాలుడిపై మంగళవారం రాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. కొన్ని కుక్కలు ఆ బాలుడి నెత్తి భాగాన్ని పీక్కుతిన్నాయి. విహాన్ జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతిచెందాడని స్థానికుడు నరేందర్ యాదవ్ తెలిపారు.
Similar News
News September 24, 2024
HYD: డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు
దోస్త్ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్. లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫొటో, ఆధార్ కార్డ్, 2 జిరాక్సు సెట్స్ తీసుకురావాలని కోరారు.
News September 24, 2024
పటాన్చెరులో నేడు రేషన్ డీలర్ల సభ
నేడు పటాన్చెరులో న్యాయమైన డిమాండ్లకు రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి (MLA), రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాయికోటి రాజు తెలిపారు. ఓ కన్వెన్షన్ హాల్లో జరిగే సభకి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీలర్లు హాజరు కానున్నారు. అలాగే ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు తెలిపారు.
News September 24, 2024
HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు
రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.