News August 10, 2024
HYD: బీబీనగర్ AIIMS వైద్య సేవలు రిపోర్ట్

HYD శివారు బీబీనగర్ AIIMS 2023-24 సంవత్సరానికి సంబంధించి 3,65,395 మంది అవుట్ పేషెంట్లు, 7,953 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 750 పడకల సామర్థ్యం ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం 20 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ వంద మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు.
Similar News
News September 18, 2025
HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్బాగ్లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్వాంటెడ్ కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.
News September 18, 2025
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!
News September 18, 2025
మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి సందడి

కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు.. ఇవన్నీ మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి కొలువుదీరనున్నాయి. 10 రోజుల పాటు నగర ప్రజలను ఆకట్టుకోనున్నాయి. పల్లె గొప్పదనం చెప్పేలా.. పల్లె రుచులు తెలుసుకొనేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శిల్పారామంలో సరస్ మేళా రేపు ప్రారంభం కానుంది. 29వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.