News March 12, 2025
HYD: భగ్గుమంటున్న ఎండ.. రెండ్రోజులు జాగ్రత్త!

ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.
Similar News
News November 1, 2025
HYD: ప్రముఖులను అందించిన నిజాం కాలేజీ

HYD బషీర్బాగ్లోని నిజాం కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలోనే మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, KTR, నాదెండ్ల మనోహర్, ప్రొ.కోదండరాం, అసదుద్దీన్ ఒవైసీ, బాలకృష్ణ, అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ, IPS అధికారులు CVఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ప్రముఖులు చదివారు. శుక్రవారం TG మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ కూడా నిజాం కాలేజీ పూర్వ విద్యార్థే.
News October 31, 2025
HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?
News October 31, 2025
HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

1928లో గుజరాత్లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్లో విలీనం అయింది.


