News July 5, 2025
HYD: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీకుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.
Similar News
News July 5, 2025
ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి SUICIDE

పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వల్లాపురానికి చెందిన ఇండేమందల యశ్వంత్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి కిష్టాపురంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
News July 5, 2025
MDK: సిగాచి పరిశ్రమ ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. తాజాగా ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మరో ముగ్గురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు బీహర్, ఒకరు ఒడిశాకు చెందిన కార్మికులుగా నిర్ధారించారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
News July 5, 2025
మెడికల్ రిక్రూట్మెంట్: మెరిట్ లిస్ట్ విడుదల

TG: 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, MNJ ఆస్పత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల <