News December 1, 2024
HYD: మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో కొత్త రక్తం చేరబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని, తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని మోదీ చెప్పారని అన్నారు. డిసెంబర్ 6న సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
బల్కంపేట ఎల్లమ్మకి కార్తీక సోమవారం పూజలు

నగరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ క్షేత్రంలో వేకువ జామునుంచే అమ్మవారికి అభిషేకాలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఎల్లమ్మ పోచమ్మ తల్లి కరుణించవమ్మ అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పంచ హారతుల కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 30MIN పడుతోందని భక్తులు చెబుతున్నారు.
News October 27, 2025
HYD: నిద్రలో గురక పెడుతున్నారా?

నిద్రలో శ్వాస లోపాలపై నిమ్స్లో అవగాహన సదస్సు జరిగింది. డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ.. ‘ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గుండె, మధుమేహంపై ప్రభావం చూపుతుంది’ అన్నారు. ప్రొ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. గురక తీవ్ర వ్యాధికి సంకేతం. ఇది రక్తపోటు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. పాలీ సామ్నోగ్రఫీ (Sleep Study) ద్వారా వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు. SHARE IT.
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.


