News September 3, 2025
HYD: మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు

HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
Similar News
News September 4, 2025
చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆయన కలిశారు.
News September 4, 2025
గుంటూరు వాసికి అరుదైన గౌరవం

గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. బల్ద్విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయనకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్ ఆర్బీ అవార్డు వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్ (రాజ్) 2025 ఏడాదికిగానూ లార్జ్ కార్పొరేట్ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు.
News September 4, 2025
నిర్మల్: ఈనెల 6న వైన్స్ బంద్

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.