News March 3, 2025

HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.

Similar News

News March 3, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>పాడేరు: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 26 కేంద్రాలు>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..224మంది గైర్హాజర్>అల్లూరి: ఓపెన్ ఇంటర్..261మంది గైర్హాజర్>అల్లూరి ఘాట్‌లో జీపు దగ్ధం>కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి>ఘనంగా ప్రారంభమైన మోతుగూడెం కొండ జాతర>దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు భారీ క్రేన్లు >అనంతగిరి: అటవీశాఖ అధికారులు సహకరించాలి

News March 3, 2025

కొత్తగూడెం: పీడీఎస్‌యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

నేడు ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. కొత్తగూడెం కార్యాలయంలో సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రాజేశ్, సహాయ కార్యదర్శిగా వెంకటేశ్, కోశాధికారిగా భాస్కర్‌తో పాటు 11 మంది కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు.

News March 3, 2025

రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!