News March 27, 2024

HYD: మహిళా కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలు

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి

image

మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.

News September 29, 2024

HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!

image

HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

News September 29, 2024

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్

image

సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.