News March 3, 2026

HYD: మహిళా దారుణ హత్య

image

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 3, 2026

హుస్సేన్‌సాగర్‌కు కొత్త కళ

image

ట్యాంక్‌బండ్ తీరానికి కొత్త కళ రాబోతోంది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల విస్తరణకు HMDA రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనుంది. PVNR మార్గ్ వెంబడి తీరాన్ని పటిష్ఠం చేస్తూ రివెట్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. పనుల్లో భాగంగా 5,424 చదరపు మీటర్ల మేర అందమైన పెయింటింగ్స్‌తో గోడలను తీర్చిదిద్దనున్నారు. నాలుగేళ్ల గడువులోగా ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది.

News March 3, 2026

మెట్రో ఫేజ్-2 వారసత్వ కట్టడాల సవాలు

image

HYD మెట్రో ఫేజ్-2 విస్తరణలో పాతబస్తీ కారిడార్ ఇప్పుడు అధికారులకు పరీక్షగా మారింది. వారసత్వ కట్టడాల రక్షణపై హైకోర్టు నిబంధనలు కఠినంగా ఉండటంతో అలైన్‌మెంట్‌లో సాంకేతిక మార్పులు తప్పనిసరయ్యాయి. అటు L అండ్ T నుంచి ప్రాజెక్టు బాధ్యతల బదిలీపై ప్రభుత్వ కసరత్తు సాగుతుండగా ₹42,000 కోట్ల భారీ వ్యయంలో కేంద్రం 20% వాటాపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్ డెన్సిటీ అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.

News March 3, 2026

HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. రంగుపడుద్ది

image

హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.