News December 22, 2025

HYD: మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి: సీపీ

image

రాచకొండ సీపీ సుధీర్ బాబు 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించి, రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో 495 మందిని అరెస్ట్ చేయగా, అందులో 322 మంది స్థానికులు, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారని, 227 NDPS అనుమానిత షీట్లు తెరిచారమన్నారు. రాచకొండను నాన్-బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

Similar News

News January 2, 2026

MBNR: TG TET.. బందోబస్తు ఏర్పాటు: SP

image

MBNR జిల్లాలో TG TET దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి.జానకి తెలిపారు. పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 2, 2026

ఇతిహాసాలు క్విజ్ – 115 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడిని బంధించిన వానర రాజు ఎవరు? తన శక్తితో ఆ రాజు రావణుడిని ఏం చేశాడు?
సమాధానం: రావణుడిని బంధించిన వానర రాజు వాలి. రావణుడు తనను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ధ్యానంలో ఉన్న వాలి చంకలో నొక్కి పట్టుకున్నాడు. 6 నెలల పాటు బందీగా ఉంచుకుని, 4 సముద్రాల మీదుగా ఆకాశంలో విహరించాడు. వాలి బలం ముందు రావణుడి పప్పులు ఉడకలేదు. చివరికి రావణుడు తన ఓటమిని అంగీకరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 2, 2026

ఈ ఏడాది అత్యధిక పెట్టుబడులు APలోనే: లోకేశ్

image

AP: FY2026లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికం ఆంధ్రాకే దక్కినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. AP(25.3%) అగ్రస్థానంలో తర్వాత ఒడిశా(13.1%), మహారాష్ట్ర(12.8%), TG(9.5%) ఉన్నాయని తెలిపింది. ‘FY2026లో రాష్ట్రానికి 25.3% పెట్టబుడులు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చూడటానికి ఇలాగే ఉంటుంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది’ అని ట్వీట్ చేశారు.