News February 27, 2025
HYD: మానసికంగా ఒత్తిడి ఉందా..? కాల్ చేయండి!

HYD, MDCL, RR జిల్లావాసులు ఒత్తిడికి గురవడం, మానసికంగా ఆవేదన చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటే టెలీ మానస్ హెల్ప్లైన్ 14416కు కాల్ చేయాలని ఉప్పల్ పీహెచ్సీ డాక్టర్ సౌందర్యలత తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మానసిక తేడాలు గుర్తించినా కాల్ చేయొచ్చన్నారు. మానసిక సంబంధిత అంశాలన్నింటికి పరిష్కారం ఉంటుందని, ఈ విషయాన్ని అందరికీ తెలపాలని కోరారు.
#SHARE IT.
Similar News
News February 27, 2025
HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

పండగపూట లంగర్హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.
News February 27, 2025
HYD: ఉపాధ్యాయుడి వేధింపులు.. రిమాండ్

ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదర్గుల్లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్కు తరలించారు.
News February 27, 2025
HYD: ఆ రోజులూ మళ్లీరావు..!

శివరాత్రికి శివుడిని ఎంత ఇష్టంగా కొలుస్తారో.. అంతే ఇష్టంగా జాగరణలో చేస్తారు. HYDలో అనేక చోట్ల యువత కోసం రాత్రంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేశారు. పెద్దలు స్వామి వారిని.. సంకీర్తనలు, భజనతో స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేశారు. కానీ గతంలో మన ఊళ్లల్లో వేసే పద్య, పౌరాణిక, జానపద నాటకాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నతనంలో పదాలు అర్థం కాకపోయినా చూస్తూ కూర్చునేవాళ్లం. మీరెలా జాగరణ చేశారు.