News October 13, 2025

HYD: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈనెల 17 నుంచి రోజువారీ జిల్లా ట్రయల్‌ కోర్టు విచారణ జరపనుంది. మాధవిని ఆమె భర్త గురుమూర్తి హత్య చేసి, ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడుకబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్‌ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 నెలల్లో తీర్పు వస్తుందని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

Similar News

News October 13, 2025

NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

image

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

News October 13, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.

News October 13, 2025

LED స్క్రీన్‌లో వేములవాడ రాజన్న దర్శనం

image

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.