News October 25, 2025
HYD: మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా.. జర జాగ్రత్త..!

ఓ మహిళ మంటల్లో కాలిపోయిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD సరూర్నగర్ PS పరిధి త్యాగరాయనగర్ కాలనీలోని MSR రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో మాధవి(45) నివాసం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత బయటకు వెళ్లిన మాధవి కొద్దిసేపు తర్వాత తిరిగొచ్చి వెలిగించింది. దీంతో మంటలు అంటుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. కేసు నమోదైంది. జర జాగ్రత్త..!
Similar News
News October 25, 2025
నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.
News October 25, 2025
మద్యం దుకాణాల లాటరీ.. 24 షాపులకు 474 దరఖాస్తులు

2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామగుండం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 షాపుల కోసం మొత్తం 474 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ CI మంగమ్మ తెలిపారు. ఈ లైసెన్సుల కేటాయింపు లాటరీ పద్ధతిలో OCT 27, సోమవారం ఉదయం 11 గంటలకు PDPL జిల్లా బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకే హాజరుకావాలని CI సూచించారు.
News October 25, 2025
చందుర్తి: ఆర్థిక ఇబ్బందులతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

చందుర్తి మండలం సనుగుల దేవుని తండా అంగన్వాడీ కేంద్రం టీచర్ గొట్టె పరిమళ (39) శనివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 23 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న పరిమళ.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త నరేష్, ఇద్దరు కుమారులు ఉన్నారు.


