News July 23, 2024

HYD: ముందడుగు.. విజన్-2047లో RRR..!

image

HYD చుట్టూ RRR నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే భారత్ మాల-1లో ఉత్తర భాగం, భారత్ మాల-2ప్రాజెక్టులో దక్షిణ భాగం అభివృద్ధి చేయాలని భావించినా దక్షిణ భాగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రస్తుతం కేంద్రం తాజాగా విజన్-2047లో చేర్చినట్లుగా సమాచారం. దక్షిణభాగం ఆమనగల్, షాద్‌నగర్,చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉండనుంది.

Similar News

News September 9, 2025

గ్రంథాలయాలను బలోపేతం చేయాలి: డా. రియాజ్

image

తెలంగాణలోని అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. “మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక” అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు నడక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.

News September 9, 2025

HYD: మరో రెండు రోజులు పారిద్ధ్య పనులు

image

నెక్లెస్‌ రోడ్డుతో పాటు పీపుల్స్‌ప్లాజా, బేబిపాండ్, ఎన్టీఆర్‌ మార్గ్, సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కారణంగా చెత్త పేరుకుపోయింది. నెక్లెస్‌ రోడ్డులో 100 మంది స్వీపర్లు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 30 మంది స్వీపర్లు విధుల్లో పాల్గొంటున్నారు. చెత్త తొలగింపునకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు విగ్రహాల ఐరన్‌ రాడ్స్‌ను తొలగిస్తున్నారు.

News September 9, 2025

రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం

image

ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. భాషా, సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ధిక్కార స్వరం ప్రజా కవి కాళోజీ నారాయణరావు అని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఎన్‌.బాలాచారి పాల్గొన్నారు.