News January 28, 2025
HYD: ముసుగు దొంగలు.. జర జాగ్రత్త..!

గ్రేటర్ HYDలో ముసుగు దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. ఘట్కేసర్ PS పరిధి అంకుషాపూర్లో వారం రోజులుగా రాత్రిపూట ముసుగు ధరించి ఓ ముఠా గల్లీల్లో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముసుగులు వేసుకుని దొంగలు సంచరిస్తుండడంతో రాత్రివేళలో బయట తిరగాలంటే భయపడుతున్నామని వాపోతున్నారు. గ్రేటర్ HYDలో రాత్రిళ్లు పెట్రోలింగ్ పెంచాలని HYD, సైబరాబాద్, రాచకొండ పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 9, 2026
ఏలూరు: రూ.25 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

ఏలూరు త్రీటౌన్ పోలీసులు భారీగా చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లాల్లో దొంగలించిన 50 ద్విచక్రవాహనాలను రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహన భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ బైక్లకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకర్లు, స్మార్ట్ లాక్లు అమర్చుకోవాలని ఎస్పీ సూచించారు.
News January 9, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
News January 9, 2026
తిరుమల: 7 నిమిషాల్లో శ్రీవాణి టికెట్లు పూర్తి.!

తిరుమల శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ విధానం నేటి నుంచి ప్రారంభమైంది. 800 టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా 1+3 విధానంలో జారీ చేయగా 7ని.ల్లో పూర్తయ్యాయి. సా.4 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్లో 200 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం(10రోజులు)లో 7.83 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు.


