News February 21, 2025
HYD: ముస్లింలపై సీఎంది సవతి తల్లి ప్రేమ: ఉల్లాఖాన్

రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని మజ్లీస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ ప్రశ్నించారు. గురువారం HYDలో మాట్లాడుతూ.. హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లిం పండుగలపై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ముస్లిం సంస్థలను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నిం
Similar News
News February 22, 2025
ఐకానిక్ టవర్ నిర్మాణం కోసం కమిటీ

AP: అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.
News February 22, 2025
అనంతపురం జిల్లా నేటి ముఖ్యాంశాలు ఇవే

☞ గుత్తి వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు☞అనంతపురం పెట్రోల్ బంక్ లో మోసం..రూ.2.9 కోట్ల మేర మోసం ☞ తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ద్వజారోహణం కార్యక్రమం ☞ టమోటా రైతులు అధైర్యపడవద్దు-ఎమ్మెల్యే పరిటాల సునీత ☞అనంతపురంలో గ్రూప్ 2 వాయిదా నిరసన ☞ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ లక్ష్మీనారాయణ
News February 22, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు