News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
Similar News
News February 28, 2026
KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు, ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.
News February 28, 2026
కరీంనగర్ ప్రగతికి ‘త్రిశూల’ వ్యూహం!

కరీంనగర్ అభివృద్ధి ఇప్పుడు ముగ్గురు నాయకులపై ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘స్మార్ట్ సిటీ’ నిధులపై పట్టు సాధిస్తుండగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఈ ముగ్గురు కీలక నేతలతో నగరం రూపురేఖలు మారుతాయా లేదో చూడాలి.
News February 28, 2026
చిలుకూరు ఆలయానికి వన్నె తెచ్చింది ఆయనే!

చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ వన్నె తెచ్చారు. HYDకు కూతవేటు దూరంలో మొయినాబాద్ మం.చిలుకూరులో ఉన్న బాలాజీ గుడికి 2000 సంవత్సరం వరకు పెద్దగా ప్రాచుర్యంలేదు. సౌందరరాజన్ ఉద్యోగ విరమణ తర్వాత ఆలయానికి వచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అప్పటి వరకు ఉత్సవాల సమయంలోనే భక్తులు వచ్చేవారు. స్వయం ప్రతిపత్తి దేవాలయంగా ప్రకటించి హుండీ, కానుకలు, టికెట్లు లేకుండా ఆలయాన్ని నడిపించారు.


