News September 24, 2025
HYD: మూసీ వద్ద మహిళ మృతదేహం.. ముగ్గురి అరెస్ట్

మూసీ నది వద్ద లభ్యమైన మహిళా మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుర్గారెడ్డి, గులామ్ దస్తగిర్ ఖాన్, మొహమ్మద్ ఇమ్రాన్లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసి, కర్రలతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Similar News
News September 24, 2025
గజలక్ష్మి దేవి రూపంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. గజలక్ష్మి అంటే ఏనుగులతో ఉన్న లక్ష్మి దేవత అని అర్థం. ఈ మాత లక్ష్మీదేవి, అష్టలక్ష్మి రూపాలలో ఒకటి. ఈ రూపంలో ఆమె పద్మాసనంపై కూర్చుని, ఇరువైపులా ఏనుగులు తొండాలతో ఆమెపై నీటిని పోస్తూ ఉంటారు. గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే శ్రేయస్సు, సంపద, అదృష్టం, కలుగుతుందని భక్తుల నమ్మకం.
News September 24, 2025
కూకట్పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

కూకట్పల్లి సుమిత్రానగర్లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 24, 2025
మైలార్దేవ్పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

మైలార్దేవ్పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.