News February 26, 2026
HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్కు కేంద్ర బడ్జెట్లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
Similar News
News March 1, 2026
కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News March 1, 2026
ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్కు IRGC వార్నింగ్

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
News March 1, 2026
అనంతపురంలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. అనంతపురంలోని కమ్మ భవన్, హైదరాబాద్-బెంగళూరు హైవే, రామ్నగర్, రుద్రంపేటలో నేటి ఉదయం 10 AMలకు సదస్సు జరగనుంది. కార్యక్రమంలో JD లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ డోంట్ మిస్.


