News March 9, 2025
HYD: మెట్రోలో గుండె తరలించిన వైద్యులు

HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్లో మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.
Similar News
News March 9, 2025
IND VS NZ: హైదరాబాద్లో ఇదీ పరిస్థితి!

హైదరాబాద్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.
News March 9, 2025
HYD: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు

TGలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. HYD, RR జిల్లాల్లో కొత్తగా చాంద్రాయణగుట్ట, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కోస్కూల్కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. గతంలోనే 3 స్కూల్స్కు GO ఇచ్చినట్లు భట్టి తెలిపారు. కాగా, గతేడాదే కొందుర్గులో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు CM శంకుస్థాపన చేశారు.
News March 9, 2025
HYD: ఈనెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.