News July 9, 2025
HYD: మెట్రో పార్కింగ్.. తప్పించుకోలేరు..!

HYD నగర మెట్రో స్టేషన్లు వద్ద వాహనాలు పార్కు చేసి, ఎవరు చూడని సమయంలో పార్కింగ్ ఫీజు కట్టకుండా బైకులు తీసుకెళ్లినవారు తప్పించుకోలేరని నిర్వాహకులు తెలిపారు. మీరు పార్కు చేసినప్పుడే డిజిటల్ రూపంలో అన్ని వివరాలు పొందు పరుస్తారు. పార్కింగ్ ఫీజు ఆన్ లైన్లో జెనరేట్ అవుతుంది. మరోసారి వచ్చినపుడు కనుక చెల్లిస్తే మీకు తెలియకుండానే గత పెండింగ్ పార్కింగ్ ఫీజు, ప్రస్తుతం ఫీజు కలిపి చెల్లించాల్సి వస్తుంది.
Similar News
News July 10, 2025
ASF: మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా మాధ్యమిక అధికారిణి కళ్యాణితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపళ్లతో సమీక్ష నిర్వహించారు.
News July 9, 2025
జగిత్యాల: ‘మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలు’

మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఓ రఘువరన్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సంఘాలు సాధించిన విజయాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఓదెల గంగాధర్ పాల్గొన్నారు.
News July 9, 2025
27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ

నమీబియా పర్యటనలో ఉన్న PM మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధానికి అందజేశారు. 2014లో PM అయినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ అవార్డు. 5దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.