News April 9, 2025
HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
Similar News
News April 18, 2025
నారాయణపేటలో MURDER.. జైలు శిక్ష

ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పునిచ్చారని ఎస్పీ తెలిపారు. కోర్టు లిజనింగ్ ఆఫీసర్ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాలు.. గోపి అనే వ్యక్తి మల్లేశ్ను హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నేరస్థుడు గోపికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
News April 18, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 18, శుక్రవారం)

ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 18, 2025
నారాయణపేట: ‘నా భర్త చనిపోయాడు.. నన్ను ఆదుకోండి మేడం’

మద్దూరు మండలంలో జరిగిన భూభారతి సభలో ఓమేశ్వరి అనే మహిళ తన సమస్యను కలెక్టర్కి వివరించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళ మాట్లాడుతూ.. తన భర్త కాశప్ప చనిపోయి సంవత్సరం అవుతోందని, కానీ తనకి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వం పథకం నుంచి లబ్ధి చేకూరలేదన్నారు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తన గోడు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం సహాయం చేయాలని కలెక్టర్ని కోరారు.