News December 10, 2025
HYD: మెస్సీ మ్యాచ్.. పాస్ లేకుంటే నో ఎంట్రీ

ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న జరిగే మెస్సీ–గోట్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టినట్టు రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. టికెట్ లేదా పాస్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పాస్ లేకుండా స్టేడియం వద్దకు రావొద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, అంతా సహకరించాలని కమిషనర్ కోరారు.
Similar News
News December 12, 2025
వనపర్తి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

వనపర్తి జిల్లాలో 87 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 84.94 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
భద్రాద్రి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 71.79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య కోరారు. ఫోన్పేలో కొత్తగా ఈ ఛాలాన్ అనే టాబ్ ద్వారా వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్లో చెల్లించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.


