News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్..NOT ALLOWED

ఉప్పల్లో నేడు జరగనున్న “మెస్సీ” గోట్ ఇండియా టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కెమెరాలు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, సిగరెట్లు, లైటర్లు, ఆయుధాలు, నీటి సీసాలు, మద్యం, ఆహారం, బ్యాగులు, ల్యాప్టాప్లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్లు, బైనాక్యులర్లు, పటాకులు, మత్తు పదార్థాల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు.
Similar News
News March 10, 2026
రేపు జగన్ ప్రెస్మీట్

AP: వైసీపీ చీఫ్ జగన్ రేపు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.
News March 10, 2026
ప్రజాప్రతినిధుల శిక్షణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల 12న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్లు, కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99రోజుల కార్యక్రమంలో ఆయా థీమ్స్ పై ప్రజాప్రతినిధులకు శిక్షన ఇవ్వనున్నట్టు తెలిపారు.
News March 10, 2026
గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.


