News July 19, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక

image

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెహికల్ ఓనర్‌తో పాటు తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల HYD శివారులోని శంకర్‌పల్లిలో బాలుడు (16) స్నేహితులతో కలిసి కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తు చేశారు. దీంతో కారు యజమాని, తండ్రిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. SHARE IT

Similar News

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.

News September 3, 2024

RRR భూముల విలువ భారీగా పెరిగాయి

image

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 2 నుంచి 5 రెట్ల వరకు పెంచేసింది. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి RRR దక్షిణ భాగంపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు.

News September 3, 2024

జూబ్లీహిల్స్: బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

image

ప్రపంచ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న మహానగరం ప్రజా రవాణాలో వెనకబడిపోతోంది. బస్సుల కొరతతో వందలాది మార్గాలను ఆర్టీసీ వదిలేసింది. ప్రస్తుతం నగరంలో 2,850 సిటీ బస్సులు 795 మార్గాలలో 25వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం 1,000 బస్సులు తక్కువగా నడుస్తున్నందున ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి.