News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

Similar News

News September 9, 2025

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక.. ఈనెల 17 వరకు అవకాశం

image

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ యువతకు కీలక సూచనలు చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈనెల 17 వరకు అవకాశం ఉందని కర్ణన్ తెలిపారు. ఈ సంవత్సరం జులై 1కి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువత కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

News September 9, 2025

HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

image

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

News September 9, 2025

నార్సింగిలో ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి

image

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహరీక రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి రూ.10 లక్ష డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ రూ.4 లక్షలు తీసుకుంటుండగా మనిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.