News September 20, 2025
HYD: యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తాం: మంత్రి

HYDలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తోన్న నెట్వర్క్ ఆసుపత్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Similar News
News September 20, 2025
హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.
News September 20, 2025
HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్కు వినతి

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
News September 20, 2025
HYD: MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి..!

కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రంలో MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి. ఐసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసే సరికి MBAలో 4,456 సీట్లు, MCAలో 2,504 సీట్లు మిగిలాయి. ఇదిలా ఉండగా సీట్లు పొందిన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈనెల 23వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన HYDలో తెలిపారు.