News February 3, 2025
HYD: యాక్సిడెంట్.. MLA గన్మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో MLA గన్మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్పల్లి మండలం బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్మెన్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 3, 2025
HYDలో త్రిష ట్రైనింగ్.. ఇదీ ఫలితం!
గొంగడి త్రిష.. U-19 క్రికెట్లో ఈ పేరు ఓ సంచలనం. తన ప్రతిభతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచారు. ఇంతలా పేరు తెచ్చుకున్న ఆమె మన తెలంగాణ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2013లో భద్రాచలం నుంచి HYDకి వచ్చిన రామిరెడ్డి 7 ఏళ్ల త్రిషను సికింద్రాబాద్లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్ చేసిన త్రిష నేడు తన ప్రదర్శనతో HYDలో బెస్ట్ ట్రైనింగ్ ఉందని నిరూపించారు.
News February 3, 2025
SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అలర్ట్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
News February 2, 2025
HYD: కేంద్రం మొండిచేయి చూపింది: మహేష్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని TPCC అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోని కేంద్ర నిధులు ఇస్తుందని, అభివృద్ధి అంటే బీజేపీ ఇష్టంగా మారిందన్నారు. ఎన్నికల గెలవాలని ఉద్దేశంతోనే నిధులు ఇచ్చారని, మోదీకి అనేకసార్లు కలిసి విన్నవించినా కనికరించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.