News March 9, 2025

HYD: యాచారంలో 10 వేల కోళ్లు మృతి

image

కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న రైతు పౌల్ట్రీ ఫామ్‌లో పెద్ద సంఖ్యలో కోళ్ల మృతితో రైతు విచారం వ్యక్తం చేశారు. నానక్‌నగర్‌లో రైతు చల్లా కృష్ణారెడ్డి పౌల్ట్రీ ఫాంలో అనుకోకుండా ఒక్కసారిగా పదివేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు చనిపోవడంతో దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎలాగైనా ప్రభుత్వం, అధికారులు తనను ఆదుకోవాలని కోరారు. గుంతలో కోళ్లను పూడ్చిపెట్టారు.

Similar News

News March 9, 2025

IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

image

హైదరాబాద్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్‌ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో‌ మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

News March 9, 2025

కేశంపేటకు చేరుకున్న ప్రవీణ్ మృతదేహం

image

ఇటీవల అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి గంప ప్రవీణ్ మృతదేహం స్వగ్రామం షాద్‌నగర్‌లోని కేశంపేటకు చేరుకుంది. తానా సహకారంతో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాగా కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు. గత మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరపగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 9, 2025

HYD మండుతోంది.. జాగ్రత్తలు..!

image

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.- నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.- బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.- రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.- దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.- ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తిరగకూడదు.

error: Content is protected !!