News August 23, 2025

HYD: యూరియా సరఫరాపై మంత్రుల సమీక్ష

image

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, BRS దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News August 24, 2025

HYD: ఈ ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తే ఛార్జీల్లో డిస్కౌంట్

image

పలు రకాల బస్సుల్లో ప్రయాణానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. HYD నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే లహరి NON-AC, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి AC, రాజధాని AC బస్సుల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. HYD నుంచి కడప, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, సహా అనేక ప్రాంతాలకు వెళ్లే బస్సులకు వర్తిస్తుందన్నారు.

News August 24, 2025

HYD: ఐరన్ పైపు తలపై పడి యువకుడి మృతి

image

HYD సూరారం PS పరిధిలో 4వ అంతస్తు నుంచి ఐరన్ పైపు తలపై పడి అరవింద్ అనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు తెలిపారు. అరవింద్ బిల్డింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు పర్యవేస్తుండగా ఐరన్ పైప్ ఒక్కసారిగా పడిందన్నారు. తీవ్రగాయాలైన అతడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడని చెప్పారు. ఈరోజు కేసు నమోదు చేశామన్నారు.

News August 24, 2025

HYD: ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరికి వెళ్లిన ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదైంది. సైఫాబాద్ పీఎస్‌లో సీఐ ఫిర్యాదుతో 11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఇది కాంట్రాక్టర్లను భయపెట్టే, గొంతు నొక్కే కుట్ర మాత్రమే అని కాంట్రాక్టర్లు చెప్పారు. మమ్మల్ని కేసులతో బెదిరిస్తే వెనక్కి తగ్గమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టర్లపై పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.