News February 13, 2025

HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

image

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News July 6, 2025

ఫాతిమా కాలేజీని కూలుస్తారా? ‘హైడ్రా’ రంగనాథ్ ఏమన్నారంటే?

image

HYDలో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ సలకం చెరువు FTLలో ఉండటంతో దాన్ని కూల్చివేయాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ‘అక్బరుద్దీన్‌పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించారు. అందులో చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. మేము జీవితాలను నాశనం చేయం. ఫైనల్ రిపోర్ట్ రానివ్వండి’ అని ట్విటర్ స్పేస్‌లో అన్నారు.

News July 6, 2025

జగిత్యాల: పలువురు ఎస్ఐలకు స్థాన చలనం

image

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు బాసర మల్టీజోన్ ఐజీ 2 ఉత్తర్వులు జారీ చేశారు. కే. కుమారస్వామి బీర్పూర్ నుంచి డీఎస్‌బీ జగిత్యాల, మిర్యాల రవీందర్ వీ.ఆర్ జగిత్యాల నుంచి ధర్మపురి ఎస్సై 2, ఎస్.రాజు వీ.ఆర్ జగిత్యాల నుంచి బీర్పూర్, ఎం.సుప్రియ వీ.ఆర్ జగిత్యాల నుంచి సీసీఎస్ జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

News July 6, 2025

కాశ్మీర్ విషయంలో ముఖర్జి దృఢమైన వైఖరి: బండి సంజయ్

image

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన పడిన తపనను, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన దృఢమైన వైఖరిని బండి సంజయ్ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.