News March 5, 2025
HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్ (UPDATE)

రాయదుర్గంలో వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆత్మహత్యకు అదనపు కట్నం కోసం వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి అయిన 6 నెలలకే కూతురు చనిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. భర్త శరత్ చంద్రను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. దేవిక మృతదేహానికి ఉస్మానియాలో పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
Similar News
News March 6, 2025
ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?
News March 6, 2025
సీపీఎంకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి: కూనంనేని

సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
News March 6, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES…

✷ TPG: జగన్పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR