News November 11, 2025
HYD: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్ను ఉల్లంఘిస్తున్నారని BRS ప్రతినిధుల బృందం HYD BRK భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 11, 2025
శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారు

ఉత్తరాంధుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీశంబర పోలమాంబ అమ్మవారి 2025-26 జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే జనవరి 26వ తేదీన తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవ కార్యక్రమం జరగనుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ ఛైర్మన్, ఉపసర్పంచ్, మాజీ ఛైర్మన్లు, గ్రామ పెద్దలు, సేవకులు, ఆశాదిలు, తదితరులున్నారు.
News November 11, 2025
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి.


