News October 12, 2025

HYD: రూ.కోట్ల అద్దె ఎగ్గొడుతున్నప్పటికీ.. నోటీసులేనా?

image

HMDA పరిధిలో రూ.కోట్ల పాయల అద్దెలు ఎగ్గొడుతున్నప్పటికీ HMDA సరిగ్గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవ పార్క్ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదు. కోట్ల బకాయిలు ఉన్నాయి. HMDA మాత్రం నోటీసులకు మాత్రమే పరిమితమవుతుంది.

Similar News

News October 12, 2025

ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

image

పాదాల సంరక్షణకు ఫుట్‌వేర్ అవసరం. వీటిని కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. మీ పాదాల సైజ్‌కు సరిపోయేవే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉన్నా నడవడానికి ఇబ్బందవుతుంది. స్టైల్‌తో పాటు మనం పెట్టే డబ్బుకి తగ్గ క్వాలిటీ ఉందో..లేదో చూడాలి. రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్స్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.

News October 12, 2025

ప్రజల సౌకర్యార్థం రేపు డివిజన్లలో ప్రజావాణి: కలెక్టర్‌ జితేష్ వి పాటిల్

image

భద్రాద్రి జిల్లా ప్రజల సౌకర్యార్థం సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కాకుండా డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News October 12, 2025

VZM: ‘రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

image

పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో ఇంజినీర్ల పాత్ర, సిబ్బంది సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, బదిలీలు, సేవా పరిరక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని మహంతి పేర్కొన్నారు.