News July 7, 2024

HYD: రూ.100 కోసం హత్య

image

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

Similar News

News March 11, 2026

HYDలో డైనోసార్ ఆనవాళ్లు.. చూద్దాం రండి!

image

HYDలోని డాక్టర్ విలియం కింగ్ జియోలాజికల్ మ్యూజియం భూగర్భ అద్భుతాల ప్రదర్శనశాలగా నిలుస్తోంది. GSI ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో డైనోసార్ శిలాజాలు, అరుదైన ఖనిజాలు భౌగోళిక చరిత్రను చూపిస్తున్నాయి. భూమి పుట్టుక, ఖండాల ఏర్పాటుపై మ్యూజియంలో వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి పెంచేలా సమాచారం, నమూనాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనానికి కేంద్రంగా నిలుస్తోంది.

News March 11, 2026

HYDలో డైనోసార్ ఆనవాళ్లు.. చూద్దాం రండి!

image

HYDలోని డాక్టర్ విలియం కింగ్ జియోలాజికల్ మ్యూజియం భూగర్భ అద్భుతాల ప్రదర్శనశాలగా నిలుస్తోంది. GSI ఆధ్వర్యంలోని ఈ మ్యూజియంలో డైనోసార్ శిలాజాలు, అరుదైన ఖనిజాలు భౌగోళిక చరిత్రను చూపిస్తున్నాయి. భూమి పుట్టుక, ఖండాల ఏర్పాటుపై మ్యూజియంలో వివరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్రంపై ఆసక్తి పెంచేలా సమాచారం, నమూనాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనానికి కేంద్రంగా నిలుస్తోంది.

News March 10, 2026

HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

image

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్‌కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.