News October 28, 2025

HYD: రూ.168 కోట్లతో హైడ్రాలాజికల్ సెంటర్

image

HYDలో దాదాపు రూ.168 కోట్లతో నేషనల్ హైడ్రాలాజికల్ ప్రాజెక్టు కింద స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డ్స్ ఏర్పాటు, జలాశయాల్లో పూడికతీత, సర్వేల నిర్వహణ, ప్రాజెక్టుల వద్ద సిస్టం ఏర్పాటు యంత్ర సమీకరణ తదితర వాటిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి మొత్తం కేంద్రమే నిధులు అందించనుంది.

Similar News

News October 28, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష

image

BRS నేతలు మహిళల కన్నీళ్లను కూడా రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని పేర్కొన్నారు.

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్‌ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: మహిళలు.. కేవలం 7 శాతమేనా!

image

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇపుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ అదే పరిస్థితి. కేవలం 7% మంది మాత్రమే పోటీచేస్తున్నారు. మొత్తం 58 మంది ఈ ఎన్నికల్లో బరిలో ఉండగా కేవలం నలుగురే పోటీలో ఉన్నారు. దీంతో.. ఇదేనా మహిళలకు దక్కే సమానత్వం అని పలువురు వాపోతున్నారు.