News September 19, 2025
HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక..!

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KPHB కాలనీ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. SHARE IT
News September 19, 2025
గ్రేటర్ HYD అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటతో వరద నీరు సిటీ రోడ్లను ముంచెత్తుతోందని, ఎక్కడెక్కడ మ్యాన్ హోళ్లకు మూతలు లేవో అర్థం కావడం లేదన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
News September 19, 2025
దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు KTR: మంత్రి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీ, మరో వైపు ప్రతిపక్ష పార్టీ నువ్వానేనా అన్నచందంగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘KTR నువ్వో పిల్లబచ్చా..అసెంబ్లీ ఎన్నికల్లో కాదు దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు..అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో విదేశాలకు చెక్కేస్తవో’అని అన్నారు. నోటిదూల KTRకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని Tకాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.