News April 8, 2024
HYD: రూ.7,30,400 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

HYDలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.
Similar News
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతో HYD అభివృద్ధి.. మీ కామెంట్?

TGలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే నగర అభివృద్ధి సాధ్యమని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD MLC ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్, BRS, MIMపై తీవ్ర విమర్శలు చేశారు. మజ్లీస్ పార్టీ కోసం ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ చేయడం లేదన్నారు. HYDను బలిచేసేందుకు INC, BRS వెనుకడుగువేయడం లేదని ఆరోపించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది BJP ఒక్కటే అంటోన్న కిషన్ రెడ్డి ప్రసంగంపై హైదరాబాదీ మీ కామెంట్?
News April 20, 2025
HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్పల్లికి చెందినట్లు తెలుస్తోంది.